Sakshi News home page

Published Fri, May 4 2018 5:15 PM

MS Dhoni Fan Breaches Security To Touch His Feet  - Sakshi

కోల్‌కతా : టీమిండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్ర సింగ్‌ ధోని కోసం ఓ అభిమాని సాహసం చేశాడు. ఏకంగా మ్యాచ్‌ మధ్యలో భద్రతా వలయాలను దాటుకోని మైదానంలోకి పరుగెత్తాడు. గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌ జరుగుతుండగా (సీఎస్‌కే ఇన్నింగ్స్‌ 11 ఓవర్‌లో) డగౌట్‌లో బ్యాటింగ్‌కు సిద్దంగా ఉన్న ధోని దగ్గరకు ఓ కుర్రాడు అనూహ్యంగా వచ్చి అతని పాదాలను తాకాడు. దీనికి ధోని ఆ కుర్రాడిని దీవిస్తూ.. వెళ్లిపో అంటూ చెప్పాడు.

ఇక అక్కడే ఉన్న సీఎస్‌కే ఆటగాళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఈ ఆకుర్రాడిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోను ఐపీఎల్‌ అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అయింది. ఇలా ధోని పాదాలు తాకడం తొలి సారేం కాదు.. గతంలోను అభిమానులు మ్యాచ్‌ మధ్యలో మైదానంలోకి వచ్చి ధోని పాదాలను తాకారు.

Advertisement

What’s your opinion

Advertisement